Krithi Shetty: బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన కృతి శెట్టి

  • బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న 'శ్యామ్ సింగరాయ్'
  • హీరోగా నటిస్తున్న షాహిద్ కపూర్
  • కృతి శెట్టి పాత్రకు ఆమెనే తీసుకున్న మేకర్స్
Krithi Shetty to enter Bollywood

కన్నడ భామ కృతి శెట్టి స్టార్ మామూలుగా లేదు. 2019లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'సూపర్ 30' ద్వారా ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ చిత్రంలో ఆమె ఒక స్టూడెంట్ పాత్రను పోషించింది. 2020లో తెలుగు సినిమా 'ఉప్పెన' ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే కృతి శెట్టికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాల్లో ఆమె ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. ప్రస్తుతం కృతి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాల్లో నటిస్తోంది. 

మరోవైపు కృతి శెట్టికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆమె బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందనేదే ఆ వార్త సారాంశం. నాని, కృతి శెట్టి, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు. తెలుగులో కృతి శెట్టి పోషించిన పాత్రను హిందీ రీమేక్ లో కూడా ఆమే చేయాలని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందట. హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇది మంది అవకాశం అని భావించిన కృతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

More Telugu News