Chandrababu: జగన్ కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ లా ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి: చంద్రబాబు

  • మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్న చంద్రబాబు
  • టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం
  • రూ.25 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపణ
Chandrababu fires on CM Jagan over liquor brands

కల్తీ సారా, జే బ్రాండ్ల మద్యంపై రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఎందుకున్నాయని ప్రశ్నించారు. జగన్ కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ లా ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని వ్యాఖ్యానించారు. మద్యం కమీషన్ల కింద ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు.

More Telugu News