Prabhas: ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థికసాయం

  • ఈ నెల 11న విడుదలైన రాధ్యేశామ్
  • కారంపూడిలో బ్యానర్ కడుతూ అభిమాని మృతి
  • విద్యుదాఘాతానికి గురైన చల్లా పెదకోటి
  • పెద్దమనసుతో స్పందించిన ప్రభాస్
Prabhas financially helps a fan family

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న రిలీజైంది. అయితే, గుంటూరు జిల్లా కారంపూడిలో సినిమా విడుదలకు ముందు రోజున ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి ప్రమాదవశాత్తు మరణించాడు. బ్యానర్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. 

కారంపూడి మండల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లా అనిల్ ద్వారా ఈ విషయం ప్రభాస్ కు తెలిసింది. ఈ ఘటన పట్ల ఆయన చలించిపోయారు. వెంటనే రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తాజాగా, రూ.2 లక్షల చెక్కును మృతుడు చల్లా పెదకోటి భార్య పిచ్చమ్మకు అందించారు.

More Telugu News