Prabhas: అప్పుడే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 'రాధేశ్యామ్'?

  • ఈ నెల 11వ తేదీన వచ్చిన 'రాధేశ్యామ్'
  • 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్
  • అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు
  • ఏప్రిల్ 2వ తేదీన ఓటీటీ రిలీజ్ అనే టాక్ 
Radhe Shyam movie update

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'రాధేశ్యామ్' ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. వంశీ .. ప్రమోద్ .. ప్రసీద నిర్మించిన ఈ సినిమా 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా థియేటర్లకు వచ్చిన ఒక నెల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సినిమాలు అడుగుపెడుతుంటాయి. అలా చూసుకుంటే ఏప్రిల్ 11 తరువాత ఈ సినిమా ఓటీటీకి రావలసి ఉంటుంది.

కానీ ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీనే ఓటీటీ ద్వారా వదలాలనే ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను వారే సొంతం చేసుకున్నారు. 'ఉగాది' కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వారు చర్చలు జరుపుతున్నారట. ఆ చర్చలు ఫలిస్తే మాత్రమే ఈ సినిమా ఏప్రిల్ 2న రావడం ఖాయమేనని అంటున్నారు.  

More Telugu News