Team India: బెంగళూరులో టీమిండియాను కష్టాల్లోకి నెట్టిన లంక స్పిన్నర్లు

  • టీమిండియా, శ్రీలంక రెండో టెస్టు ప్రారంభం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 148 పరుగులకే 6 వికెట్లు డౌన్
  • 3 వికెట్లు తీసిన ఎంబుల్దెనియ
  • 39 పరుగులు చేసిన పంత్
Sri Lanka spinners pushes Team India into troubles

బెంగళూరులో ఆరంభమైన డే నైట్ టెస్టులో శ్రీలంక స్పిన్నర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు పెద్దగా కలిసిరాలేదు. లంక యువ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియ 3 వికెట్లు తీయగా, జయవిక్రమ, ధనంజయ డిసిల్లా చెరో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్ 148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. పంత్ 39, విహారి 31, కోహ్లీ 23 పరుగులు చేసి అవుటయ్యారు. 

అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ (15), మయాంక్ అగర్వాల్ (4) నిరాశపరిచారు. ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా 4 పరుగులకే వెనుదిరగడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్లకు 177 పరుగులు కాగా, శ్రేయాస్ అయ్యర్ 37, రవిచంద్రన్ అశ్విన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News