radhe shyam: తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన ప్ర‌భాస్ 'రాధేశ్యామ్‌'

  • నిన్న విడుద‌లైన‌ 'రాధేశ్యామ్' 
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల వ‌సూళ్లు
  • నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు
radhe shyam record

నిన్న విడుద‌లైన‌ ప్రభాస్ సినిమా 'రాధేశ్యామ్ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 7,000కు పైగా స్క్రీన్లపై విడుద‌లైన ఈ సినిమాకు తొలిరోజు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు రాబ‌ట్టింది. 

హిందీలో ఏ మేరకు వ‌సూళ్లు రాబ‌ట్టింద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. అమెరికాలో ప్రీమియర్, తొలి రోజు కలెక్షన్లు కలిపి 1.4 మిలియన్ల డాలర్లు రాబ‌ట్టింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. పూజ హెగ్డే ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.

More Telugu News