Goa: గోవాలో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. సాయంత్రం గవర్నర్ తో సమావేశం!

  • 40 స్థానాలకు గాను 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ
  • తమకు మరో ముగ్గురి మద్దతుందన్న గోవా బీజేపీ
  • గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
We will form government in Goa says BJP

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 18 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో గోవా బీజేపీ నేతలు స్పందిస్తూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. తమకు మరో ముగ్గురి మద్దతు ఉందని, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఈ సాయంత్రం గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. 

బీజేపీ నేతలు చెపుతున్న ముగ్గురు నేతల్లో ఆంటోనియా వాస్, చంద్రకాంత్ షెట్యే, అలెక్స్ రెజినాల్డ్ ఉన్నారు. ఆంటోనియా వాస్ గెలుపొందినట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.

More Telugu News