shobadevi: మంచిర్యాల‌లో రోడ్డు ప్ర‌మాదం.. మాజీ ఎంపీటీసీ శోభాదేవి దంప‌తుల మృతి

  • జన్నారం మండ‌లం ఇంద‌న్‌ప‌ల్లి వ‌ద్ద ఘ‌ట‌న‌
  • కారు చెట్టును ఢీ కొట్ట‌డంతో ఇద్ద‌రూ మృతి
  • అధిక వేగమే ప్రమాదానికి కారణం 
shobadevi dies in accident

మంచిర్యాల‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జ‌న్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు ఆమె భ‌ర్త ముర‌ళీధ‌ర్‌ కూడా మృతి చెందారు. జన్నారం మండ‌లం ఇంద‌న్‌ప‌ల్లి వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తోన్న‌ కారు చెట్టును ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంద‌ని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కారు అధిక వేగంతో వెళుతుండడమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News