Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన పథకం డబ్బు జమ వాయిదా

  • ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు డబ్బులు
  • మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్
  • పథకం అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామన్న అధికారులు
Jagananna Vidya Deevena postponed

విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఏడాదికి సంబంధించి నాలుగో విడత ఫీజు డబ్బులు పడాలి. అయితే, ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. పథకం అమలు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News