jawan: ఐదుగురు భార‌త‌ జ‌వాన్ల‌ను కాల్చి చంపిన తోటి జ‌వాను

  • పంజాబ్‌లోని అమృత్ స‌ర్‌లోని బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో ఘ‌ట‌న‌
  • విష‌మంగా మ‌రో జ‌వాను ప‌రిస్థితి
  • విచార‌ణ‌కు ఆదేశించిన అధికారులు
5 jawans died in punjab

పంజాబ్‌లోని అమృత్ స‌ర్‌లోని బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ బీఎస్ఎఫ్ జ‌వాను కాల్పుల‌కు పాల్ప‌డి ఐదుగురు జ‌వాన్ల ప్రాణాలు తీశాడు. త‌న‌ను తోటి జ‌వాన్లు అవ‌హేళ‌న‌కు గురి చేయ‌డంతోనే ఆ జ‌వాను ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. 

ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో జ‌వానుకు కూడా గాయాలు కావ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్లు తెలిసింది.

More Telugu News