Rohit Sharma: ఈ టెస్టు కోహ్లీకి ప్రత్యేకంగా మిగిలిపోయేలా చేస్తాం: రోహిత్ శర్మ

  • ఏ క్రికెటర్ అయినా 100 టెస్టులు ఆడటం సామాన్య విషయం కాదు
  • కెరీర్లో కోహ్లీ ఎంతో దూరం పయనించాడు
  • జట్టు ఈ స్థాయిలో ఉండటానికి కోహ్లీనే కారణం
Will make this test match special to Kohli says Rohit Sharma

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్టు ఆడబోతున్నాడు. శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆయనకు వందో టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, కోహ్లీకి ఈ టెస్టు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తామని చెప్పాడు. ఏ క్రికెటర్ అయినా వంద టెస్టులు ఆడటం సాధారణ విషయం కాదని... తన కెరీర్ లో కోహ్లీ ఎంతో దూరం పయనించాడని కొనియాడాడు. టెస్టుల్లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాడు. టీమిండియా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన వంతుగా ఎన్నో మార్పులు తెచ్చాడని అన్నాడు. 

కోహ్లీకి తన వందో టెస్టు ఒక ప్రత్యేకమైన మ్యాచ్ గా మిగిలిపోయేలా చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్ పూర్తిగా ఐదు రోజుల పాటు కొనసాగేలా చేయాలనుకుంటున్నామని తెలిపాడు. జట్టు ఈ స్థాయిలో ఉండటానికి కోహ్లీనే కారణమని చెప్పాడు. ఇక్కడి నుంచి జట్టును తాను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నాడు. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పాడు.

More Telugu News