Rana Daggubati: 'విరాటపర్వం' రిలీజ్ పై రానా చెప్పిన మాట ఇదే!

  • రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
  • నక్సలిజం నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • కీలకమైన పాత్రలో ప్రియమణి
Virataparvam movie update

రానా కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ ప్రాంతంలో 1990లలో ఉన్న నక్సలిజం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆశయం .. ఆవేశం .. సిద్ధాంతంతో ముడిపడిన పోరాటం, ఆ మధ్యలో పెనవేసుకున్న ప్రేమకథతో ఈ సినిమా నడుస్తుంది. 


సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను క్రితం ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. అప్పటి నుంచి ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందని కొంతమంది .. ఓటీటీ వైపు వెళుతుందని కొంతమంది చెబుతూ వచ్చారు. దాంతో ఈ సినిమా ఎప్పుడు .. ఎలా రిలీజ్ అవుతుందనే అయోమయం నెలకొంది. 

ఈ క్రమంలో, ఈ సినిమా రిలీజ్ విషయాన్ని గురించి తాజాగా రానా మాట్లాడుతూ .. "రీసెంట్ గా ఈ సినిమా రీ రికార్డింగును పూర్తిచేసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రివ్యూను చూడనున్నాము. ఈ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాము" అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News