Mahesh Babu: మహేశ్ యాక్షన్ స్టిల్ మామూలుగా లేదు!

  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే కథ 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని 
  • మే 12వ తేదీన సినిమా విడుదల  
Sarkaru Vaari Paata New Poster Released

మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నాడు. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ పాళ్లు ఉంటాయని ముందుగానే చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్స్ సీన్స్ నే ముందుగా చిత్రీకరించారు. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. తాజాగా వదిలిన మహేశ్ యాక్షన్ స్టిల్ కూడా ఆకట్టుకుంటోంది. 

బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే ఈ కథలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మహేశ్ - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ ఈ  సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఇక సముద్రఖని ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News