Prakasam District: చిట్టీల పేరుతో ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడి భారీ మోసం..రూ.6 కోట్లు వసూలు చేసి పరారీ

  • ప్రకాశం జిల్లా దర్శిలో ఘటన
  • చిట్టీల పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల వసూలు
  • బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
  • రంగంలోకి దిగిన పోలీసులు
darsi govt teacher Cheating people for Rs 6 crores

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో ప్రజల నుంచి ఏకంగా 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు. జిల్లాలోని దర్శికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్‌నాయక్ ఈ ఘరానా మోసానికి తెగబడ్డాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్‌నాయక్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. నిందితుడి కోసం గాలిస్తున్నామని, పట్టుబడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News