car: రాజస్థాన్‌లో కారు ప్ర‌మాదం.. పెళ్లికొడుకు స‌హా 9 మంది మృతి

  • కారు అదుపుత‌ప్పి న‌దిలో ప‌డ్డ వైనం
  • వివాహ వేడుక కోసం వెళ్తుండ‌గా ఘ‌ట‌న‌
  • కారుని బ‌య‌ట‌కు తీసిన స‌హాయ‌క సిబ్బంది
car rammed into river

రాజస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపుత‌ప్పి న‌దిలో ప‌డిపోవ‌డంతో వరుడు సహా 9 మంది మృతి చెందారు. వివాహ వేడుక కోసం కారులో వారంతా ఉజ్జయినికి వెళ్తుండగా కోట సమీపంలోని కల్వర్టు వద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని అధికారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారంకి చంబల్‌ నది వద్ద‌కు వెళ్లిన స‌హాయ‌క సిబ్బంది, పోలీసులు అందులో పడిపోయిన కారును క్రేన్ సాయంతో తీశారు.

ఆ కారులోనే తొమ్మిది మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వివ‌రించారు. వాటిని బ‌య‌ట‌కు తీసిన అనంత‌రం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు అతి వేగంగా రావ‌డ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

More Telugu News