Talasani: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని

  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు భీమ్లా నాయక్
  • 21న ప్రీ రిలీజ్ వేడుక
  • చీఫ్ గెస్టుగా మంత్రి కేటీఆర్
  • తలసాని కూడా వస్తున్నారన్న చిత్రబృందం
Talasani will attend Bheemla Nayak pre release event as special guest

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచ్చేస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి తలసాని ప్రత్యేక అతిథిగా వస్తున్నారని చిత్రబృందం వెల్లడించింది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టయిన్ మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

పవన్, రానా, నిత్యా మీనన్, సంయుక్త నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు రాశారు. తమన్ స్వరపరిచిన గీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

More Telugu News