Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'కు చీఫ్ గెస్ట్ గా కేటీఆర్

  • విడుదలకు సిద్ధమవుతున్న 'భీమ్లా నాయక్'
  • ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా కేటీఆర్
  • సోమవారం పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్
KTR is chief guest for Pawan Kalyans Bheemoa Nayak pre release event

జనసేనాని పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది. హైదరాబాదులోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారు.

ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More Telugu News