Mahesh Babu: మళ్లీ యాక్షన్ లోకి దిగిపోయిన మహేశ్ బాబు!

  • వినోదమే ప్రధానంగా 'సర్కారువారి పాట'
  • మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని 
  • మే 12వ తేదీన భారీ రిలీజ్  
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. ఇంతవరకూ దుబాయ్ .. స్పెయిన్ .. గోవాలలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

మహేశ్ బాబు మోకాలు నొప్పి కారణంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను వాయిదా వేశారు. ఆ తరువాత మహేశ్ బాబు మోకాలు సర్జరీ చేయించుకోవడం .. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడం జరిగిపోయాయి. అందువలన ఇప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు తదితరులపై చిత్రీకరణ కొనసాగుతోంది.

మైత్రీ - 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. మే 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News