Sharwanand: షూటింగు పూర్తిచేసుకున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

  • కిశోర్ తిరుమల నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
  • శర్వానంద్ సరసన నాయికగా రష్మిక
  • హాస్యప్రధానంగా సాగే కథాకథనాలు
  • ఈ నెల 25వ తేదీన విడుదల
Adavallu Meeku Joharlu movie update

శర్వానంద్ - రష్మిక జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

ఇంతవరకూ కూడా ఎప్పటి పనులను అప్పుడు పూర్తిచేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ను బట్టే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమైపోతోంది.

హీరో పెళ్లి చూపుల ఎపిసోడ్ ఈ సినిమాలో ప్రధానమైన హాస్యాన్ని పండించనుంది. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనుకబడిన శర్వానంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

More Telugu News