Mahesh Babu: 'సర్కారువారి పాట' ఫస్టు సింగిల్ ప్రోమో రిలీజ్!

  • పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
  • మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్
  • ఈ నెల 14వ తేదీన ఫస్టు సింగిల్
  • మే 12వ తేదీన సినిమా రిలీజ్
Sarkaru Vaari Paata song promo released

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ .. 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. "వందో .. ఒక వెయ్యో .. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా .. ఏందే ఈ మాయ" అంటూ ఈ పాట మొదలవుతోంది. కీర్తి సురేశ్ ను ఫాలో అవుతూ మహేశ్ బాబు పాడే పాట ఇది .. ఫారిన్లో చిత్రీకరించారు.

తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. పూర్తి పాటను ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. కీర్తి సురేశ్ ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. తెలుగులో చాలా కాలంగా హిట్ లేకపోవడంతో, ఈ సినిమా రిలీజ్ కోసం ఆమె ఆశగా ఎదురుచూస్తోంది.  

More Telugu News