Tollywood: తెరపైకి మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

  • డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ
  • ఎక్సైజ్ శాఖ దర్యాప్తు వివరాలను ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
  • డిజిటల్ రికార్డ్స్ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు
ED writes letter to Excise to give records of Tollywood drugs case

క్లోజ్ అయిపోయిందనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమకు అందించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితులు, సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన రికార్డులు అందజేయాలని లేఖలో కోరింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవంటూ ఎక్సైజ్ శాఖ తేల్చేసింది.

అయితే ఈడీ మాత్రం ఈ కేసు విచారణ ఇంకా తొలి దశలోనే ఉందని, విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సేకరించిన డిజిటల్ రికార్డులను తమకు ఇంత వరకు సమర్పించలేదని తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఈడీకి రికార్డులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.

More Telugu News