Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు వ్యక్తులు, ఆరు ఆవులు దుర్మరణం

  • మోక్షగుండం వద్ద ఘటన
  • మిర్చి లోడుతో గుంటూరు వెళుతున్న డీసీఎం
  • ఆవులతో వస్తున్న మినీ ట్రాలీ
  • బీభత్సంగా ఘటన స్థలి
Fatal road accident in Prakasam district

ప్రకాశం జిల్లాలో ఇవాళ రహదారి రక్తదాహానికి పలువురు బలయ్యారు. మోక్షగుండం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గిద్దలూరు నుంచి మిర్చి లోడుతో గుంటూరు వెళుతున్న డీసీఎంను ఓ మినీ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ ట్రాలీలో ఉన్న 6 ఆవులు కూడా మృత్యువాతపడ్డాయి. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాద ఘటన స్థలిలో దృశ్యాలు బీభత్సంగా ఉన్నాయి. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తులతో పాటు మూగ జీవాలు కూడా మరణించడం కలచివేసింది. కాగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News