Toddy: జీలుగు కల్లు కేసులో నిందితుడి అరెస్ట్... అక్రమసంబంధమే అసలు కారణం!

  • ఈ నెల 2న తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • జీలుగు కల్లు తాగి ఐదుగురి మృతి
  • నిందితుడు వలంటీర్ రాంబాబు
  • ఓ మహిళ భర్తను చంపేందుకు కల్లులో గడ్డి మందు కలిపిన వైనం
Police arrests volunteer Rambabu in toddy deaths case in East Godavari

కొన్నిరోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి.

కాకినాడలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు తెలిపారు. వలంటీర్ రాంబాబు ఈ కేసులో నిందితుడు అని వెల్లడించారు. ఓ అక్రమ సంబంధం వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఓ మహిళ భర్తను చంపేందుకు వలంటీర్ రాంబాబు కల్లులో గడ్డి మందు కలపాడని వివరించారు. ఈ కల్లు తాగినందువల్లే ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతుల్లో మహిళ భర్త గంగరాజు కూడా ఉన్నాడని వెల్లడించారు.

More Telugu News