Anantapur District: అనంత‌పురం జిల్లా రోడ్డు ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

  • ఇన్నోవా కారును ఢీకొన్న లారీ
  • ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
  • ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ
PM Modi announces exgratia Rs 2 lakhs to deaths in Ananthapur district road accident

అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇన్నోవా కారును వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నిన్న సాయంత్రం ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఈ ప్రమాదం జరిగింది. బళ్లారిలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

More Telugu News