Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం

  • ఉరవకొండ మండలంలో ఘటన
  • కారును ఢీకొన్న లారీ
  • నుజ్జునుజ్జయిన కారు
  • మృతులు నిమ్మగల్లు గ్రామానికి చెందినవారు
Eight people died in fatal accident in Ananthapur district

అనంతపురం జిల్లాలో రహదారి నెత్తురోడింది. ఉరవకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. బుదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. బళ్లారిలో పెళ్లికి వెళ్లిన ఓ బృందం కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు ఉరవకొండ మండలంలో నిమ్మగల్లు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం శోకసంద్రంలా మారింది.

More Telugu News