Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ముందు రోడ్డు ప్రమాదం.. ఉద్యోగి మృతి!

  • ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కింద పడ్డ ప్రభుత్వ ఉద్యోగి
  • అక్కడికక్కడే మృతి చెందిన ఉద్యోగి
  • మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
Govt employee dead in road accident in Hyderabad

హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మురళీకృష్ణ అనే ప్రభుత్వోద్యోగి స్కూటీ మీద వెళ్తూ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News