Adivi Sesh: 'మేజర్' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'మేజర్'గా అడివి శేష్
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
  • మే 27వ తేదీన విడుదల
Major movie release date confirmed

కొంతకాలం క్రితం ముంబైలో హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రదాడి జరిగింది. అత్యంత ధైర్యసాహసాలతో ఆ ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాల్గొన్నారు. ఆ సంఘటనను ప్రధానంగా చేసుకుని అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను రూపొందించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సోనీ పిక్చర్స్ తో కలిసి మహేశ్ బాబు నిర్మించాడు.

వాస్తవానికి ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతూ రావడంతో, విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు.

శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికలుగా సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి .. మురళీశర్మ పోషించారు. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ వలన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

More Telugu News