Karimnagar: కరీంనగర్‌లో కారు బీభత్సం.. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి దుర్మరణం

  • కమాన్ చౌరస్తా వద్ద ఘటన
  • గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
Four Dead in a dreaded Road Accident in Karimnagar

కరీంనగర్‌లో ఓ కారు ఈ తెల్లవారుజామున బీభత్సం సృష్టించింది. కమాన్ చౌరస్తా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News