YSRCP: నివేదిక ఇవ్వండి.. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపిన స్పీకర్

  • అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ ఫిర్యాదు
  • విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఆదేశం
  • తృణమూల్ ఎంపీపైనా ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేత
Speaker Om Birla Asks Report On Raghurama Krishnaraju Suspension

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్ పై నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆదేశించారు. పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ .. స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ చర్యలకు ఆదేశించారు.

ఆ పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశాలిచ్చినట్టు లోక్ సభ సచివాలయం వెల్లడించింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపై ఆ పార్టీ లోక్ సభాపక్షనేత సుదీప్ బంధోపాధ్యాయ కూడా అనర్హత విషయంలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ నూ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.

More Telugu News