Mahesh Babu: 'సర్కారువారి పాట'కి సంబంధించి అది పుకారేనట!

  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • మోకాలు సర్జరీతో విశ్రాంతిలో ఉన్న మహేశ్
  • ఆయన కాంబినేషన్లో లేని సీన్స్ చిత్రీకరణ
  • ఏప్రిల్ 1వ తేదీన సినిమా విడుదల
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సముద్రఖని కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ .. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు మోకాలు సర్జరీ చేయించుకుని రెస్టు తీసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో హీరో కాంబినేషన్లో లేని సన్నివేశాలను పరశురామ్ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఇవి రీ షూట్ సీన్స్ అనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబుకి సంతృప్తికరంగా అనిపించని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో అలాంటిదేం లేదని, ఇదంతా పుకారేనని ఈ సినిమా యూనిట్ తేల్చేసింది.

ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సీన్స్ అన్నీ కూడా కొత్త షెడ్యూల్ కి సంబంధించినవని చెబుతున్నారు. ఇంతవరకూ ఒక్క సీన్ ను కూడా రీ షూట్ చేయలేదనీ .. ఆ అవసరమేలేదని అంటున్నారు. త్వరలోనే మహేశ్ మళ్లీ జాయిన్ కానున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పినప్పటికీ, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.

More Telugu News