Naxals: తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... నలుగురు నక్సల్స్ మృతి

  • బీజాపూర్ అటవీప్రాంతంలో తుపాకుల మోత
  • మరణించిన మావోల్లో ఏరియా కమిటీ కార్యదర్శి
  • ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్ర గాయాలు
  • హెలికాప్టర్ ద్వారా వరంగల్ తరలింపు
Four naxals died in encounter at Telangana and Chhattisgarh border

తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. బీజాపూర్ సమీపంలోని కర్రెలగుట్ట అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఏటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని హెలికాప్టర్ ద్వారా వరంగల్ కు తరలించారు. ఈ మేరకు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వివరాలు తెలిపారు. సంఘటన స్థలం పరిసరాల్లో ప్రస్తుతం గాలింపు జరుగుతోందని వివరించారు.

More Telugu News