Sankalp Reddy: 'ఘాజీ' దర్శకుడి కొత్త ప్రాజెక్టు ఇదే!

  • 'ఘాజీ'తో తెలుగు తెరకి పరిచయం 
  • 'అంతరిక్షం'తో దక్కని సక్సెస్ 
  • బాలీవుడ్ సినిమాపైనే దృష్టి 
  • 'ఐబి 91' టైటిల్ తో సెట్స్ పైకి
Vidyuth Jamwal in Sanklap Reddy movie

కొంతకాలం క్రితం తెలుగు తెరపై 'ఘాజీ' సినిమాను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నేవీ నేపథ్యంలో సాగే కథ ఇది. సాధారణంగా ఈ తరహా కథలు హాలీవుడ్ లో ఎక్కువగా రూపొందుతుంటాయని చెప్పుకున్నారు. రానా హీరోగా తెలుగులో తక్కువ బడ్జెట్ లో ఈ స్థాయి అవుట్ పుట్ తీసుకుని రావడం మామూలు విషయం కాదంటూ దర్శకుడు సంకల్ప్ రెడ్డిని ప్రశంసించారు.

ఇక ఆ తరువాత ఆయన వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం' సినిమాను తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను ప్లాన్ చేయడం సాహసమేనని అంతా ఆ కుర్రాడిని అభినందించారు. ఆ సినిమా అంతగా ఆడలేదుగానీ, సాంకేతిక విలువల దృష్ట్యా తీసిపారేసే సినిమా మాత్రం కాదు. ఆ తరువాత సంకల్ప్ రెడ్డిని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు.

ఆయన ఏం చేస్తున్నాడా అని అప్పుడప్పుడు అనుకునే అభిమానులు మాత్రం ఉన్నారు. తాజాగా ఆయన బాలీవుడ్లో ఒక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి విదుత్య్ జమ్వాల్ కథానాయకుడు .. ఆయనే నిర్మాత. 'ఐబి 91' అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఐబీ ఆఫీసర్స్ జీవితాలు .. వాళ్లు చేసే సాహసాల చుట్టూ ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు.

More Telugu News