Road Accident: హైద‌రాబాద్‌లో రోడ్డు ప్ర‌మాదం.. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ను 20 మీట‌ర్లు ఈడ్చుకెళ్లిన టిప్ప‌ర్

  • కూకట్‌పల్లిలో ప్రమాదం
  • సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి
  • ఈ రోజు ఉద‌యం 5 గంటలకు ఘ‌ట‌న‌
road accident in hyderabad

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ప్రాణాలు కోల్పోయాడు. కేపీహెచ్‌బీ కాలనీలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జగన్ మోహన్‌ రెడ్డిని ఢీ కొట్టిన ఓ టిప్పర్‌ ఆగకుండా ముందుకు వెళ్తూ అత‌డిని 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమ‌త్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఈ రోజు ఉద‌యం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు, ఎల్బీ నగర్‌ అండర్‌ పాస్‌లోనూ గ‌త‌ అర్ధరాత్రి దాటిన అనంత‌రం మ‌రో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సాగర్‌ రింగ్‌రోడ్డు వైపునుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అండర్‌ పాస్‌లో బోల్తా కొట్టింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కారును అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు కారును అక్కడి నుంచి తరలించారు.

More Telugu News