Rana Daggubati: తమిళ మూవీ రీమేక్ లో రానా?

  • శింబూ హీరోగా వచ్చిన 'మన్నాడు'
  • సురేశ్ ప్రొడక్షన్స్ చేతిలో రీమేక్ హక్కులు
  • రానా తాజా చిత్రంగా '1945'
  • ఈ నెల 7వ తేదీన విడుదల    
Rana in Mannadu Remake

శింబూ కథానాయకుడిగా ఇటీవల 'మన్నాడు' సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటించాడు. రాజకీయాలతో ముడిపడిన ఈ కథలో హీరోకి .. విలన్ కి మధ్య మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈ తెలుగు సినిమా రీమేక్ హక్కులు సురేశ్ ప్రొడక్షన్స్ వారి దగ్గర ఉన్నాయట. రానాతో వారు రీమేక్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

రానా కథానాయకుడిగా రూపొందిన '1945' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించాడు. ఇక వచ్చేనెలలో 'భీమ్లా నాయక్' ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాతనే 'విరాట పర్వం' థియేటర్లకు రానున్నట్టుగా చెబుతున్నారు.

More Telugu News