Telangana: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

  • ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు
  • వైద్య, ఆరోగ్యశాఖతో సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఆదేశాలు
  • కరోనా పరిస్థితిని బట్టి 16వ తేదీన సెలవుల పొడిగింపుపై తదుపరి నిర్ణయం
Telangana government announces holidays for schools and colleges

తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

More Telugu News