Mulugu: ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరి మృతి

  • పోలీస్ స్టేషన్ ఆవరణలో కాల్పులు
  • కాల్పులకు దారితీసిన చిన్నపాటి ఘర్షణ?
  • మరో జవానుకు తీవ్ర గాయాలు
shooting between crpf jawans one dead in mulugu dist

తెలంగాణలోని ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వెంకటాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్‌ జవాన్ల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది.

గాయపడిన మరో జవానును ములుగు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News