Radhe Shyam: రామోజీ ఫిలింసిటీలో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... ట్రైలర్ రిలీజ్

  • పీరియాడిక్ మూవీగా రాధేశ్యామ్
  • ప్రభాస్, పూజాహెగ్డే జంటగా చిత్రం
  • రాధాకృష్ణ దర్శకత్వం
  • జనవరి 14న రిలీజ్
Radhe Shyam trailer released in pre release event

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో, రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రామోజీ ఫిలింసిటీలో షురూ అయింది. ఈ కార్యక్రమంలోనే చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులందరి తరఫున సీనియర్ నటుడు కృష్ణంరాజు ట్రైలర్ ను ఆవిష్కరించారు. ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో కృష్ణంరాజు వెంట హీరో ప్రభాస్ కూడా ఉన్నారు.

More Telugu News