Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ ను కలిసి పెండింగ్ అంశాలపై వినతిపత్రం సమర్పించిన వైసీపీ ఎంపీలు

  • ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • కేంద్ర ఆర్థికమంత్రితో వైసీపీ ఎంపీల భేటీ
  • చేనేతలకు జీఎస్టీ తగ్గించాలని విజ్ఞప్తి
YCP MPs met Nirmala Sitharaman in her office

పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా వైసీపీ ఎంపీలు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కార్మికులకు పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. గతంలో ఉన్న మాదిరే 5 శాతం జీఎస్టీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్ కు వినతిపత్రం అందజేశారు.

More Telugu News