TTD: తిరుమ‌ల శ్రీ‌వారిని దర్శించుకున్న 'పుష్ప' టీమ్

  • వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నం
  • రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాల‌ స్వీకర‌ణ‌
  • సినిమా విజయం సాధించిన నేపథ్యంలో వ‌చ్చామ‌న్న యూనిట్
  • పార్ట్-2 నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షురూ చేస్తామ‌ని వ్యాఖ్య‌
pushpa team visits ttd

 'పుష్ప' సినిమా బృందం తిరుమల శ్రీ‌వారిని సందర్శించింది. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆ సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్, త‌దిత‌రులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంత‌రం వారు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. 'పుష్ప' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీ‌వారి స‌న్నిధికి వ‌చ్చామ‌ని ఆ సినిమా యూనిట్ చెప్పింది.

ఈ సినిమా పార్ట్-2 నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించ‌నున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా 'పుష్ప'ను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన విష‌యం తెలిసిందే. గ‌త రాత్రి తిరుపతిలో ఈ సినిమా సక్సెస్‌ పార్టీని నిర్వహించారు.  

       


More Telugu News