Pushpa: 'పుష్ప' సినిమా టిక్కెట్లపై ద‌ర్శ‌కుడు మారుతి, హీరోయిన్ రాశి ఖ‌న్నా మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ

  • సినిమా టిక్కెట్లు కావాల‌ని మారుతి ట్వీట్
  • టిక్కెట్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని రాశి ఖ‌న్నా రిప్లై
  • త‌న‌కూ దొర‌క‌ట్లేద‌ని వ్యాఖ్య‌
maruti tweet about pushpa tickets

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప సినిమా ఆడుతోన్న థియేట‌ర్లన్నీ నిండిపోతున్నాయి. రేపు, ఎల్లుండికి సంబంధించిన టిక్కెట్లు కూడా దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ముందుగానే అభిమానులు బుక్ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పుష్ప సినిమా టిక్కెట్లపై ద‌ర్శ‌కుడు మారుతి, హీరోయిన్ రాశి ఖ‌న్నాల మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది.
 
హైద‌రాబాద్‌లో తొలి షో టిక్కెట్ కావాల‌ని ట్వీట్ట‌ర్‌లో మారుతి పేర్కొని, అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేక‌ర్స్ ల‌ను ట్యాగ్ చేశాడు. 'టిక్కెట్లు లేవా పుష్పా?' అంటూ రూపొందించిన ఓ మీమ్ ను కూడా ఆయ‌న పోస్ట్ చేశాడు.

మారుతి ట్వీట్‌పై స్పందించిన రాశీ ఖ‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది. ‘టిక్కెట్లు దొర‌క‌డం కష్టం సర్‌.. నేను కూడా ట్రై చేస్తున్నా’ అంటూ పేర్కొంది. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. కాగా, మారుతి ప్ర‌స్తుతం గోపిచంద్, రాశీ ఖ‌న్నాల‌తో 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' అనే సినిమాను రూపొందిస్తున్నారు.

More Telugu News