Allu Arjun: సుకుమార్ నాకు కథ చెప్పింది పది నిమిషాలే: బన్నీ

  • సుకుమార్ తో ఇది మూడవ సినిమా
  • రెండు భాగాలు చేయాలని ముందుగా అనుకోలేదు
  • అడవిలో ఎన్నో కష్టాలు పడ్డాం
  • హిట్  కొడతామనే నమ్మకం ఉందన్న బన్నీ
Pushpa movie update

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఆర్య .. ఆర్య 2 తరువాత నేను .. సుకుమార్ మరో సినిమా చేయాలనుకున్నాం .. అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా కథను సుకుమార్ నాకు 10 నిమిషాలు మాత్రమే చెప్పాడు. ఆ తరువాత కథ ఏమిటి అనేది వినకుండానే ఓకే చెప్పేశాను.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన గానీ, పాన్ ఇండియా స్థాయిలో చేయాలనే ఆలోచన గాని ముందుగా లేవు. ఆ తరువాత కథాబలం కారణంగా ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. అడవిలో ఎన్నో కష్టాలు పడుతూ ఈ సినిమా చేశాము. అందుకు తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News