Telangana: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల రేపే!

  • కరోనా వల్ల రద్దయిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
  • ఇటీవలే ఆ పరీక్షలను నిర్వహించిన ఇంటర్ బోర్డు
  • ఈ ఏడాది పరీక్షలు వచ్చే ఏప్రిల్ లో జరిగే అవకాశం
Telangana Inter First Year results tomorrow

కరోనా కారణంగా తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. రద్దయిన ఆ పరీక్షలను ఇటీవలే నిర్వహించారు. ఈ క్రమంలో తొలి సంవత్సరం పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు.

మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో వార్షిక పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News