Mahesh Babu: 'సర్కారువారి పాట' విషయంలో అది రూమరేనట!

  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట'
  • కొంతభాగమే మిగిలిన షూటింగ్
  • మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్
  • ఏప్రిల్ 1వ తేదీన విడుదల  
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు కథానాయకుడిగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటంతో కావలసినన్ని థియేటర్లు దొరకవనే ఉద్దేశంతో, ఏప్రిల్ 1వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆ డేట్ లో కూడా ఈ సినిమా రావడం లేదనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది.

మహేశ్ మోకాలు సర్జరీ .. విశ్రాంతి తరువాతనే మిగిలిన షూటింగు అనే వార్తలు ఇందుకు కారణమయ్యాయి. మిగిలిన షూటింగు పార్టు చాలా తక్కువ కావడం వలన, ముందుగా ఆలోచించుకునే ఈ డేట్ చెప్పారట. అందువలన ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News