Bipin Rawat: బిపిన్ రావత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: సీఎం జగన్

  • తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
  • హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు
  • 13 మంది మృతి... ఒకరికి ఆసుపత్రిలో చికిత్స
  • ఆ ఒక్కరు రావత్ అంటూ ప్రచారం
  • ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్న జగన్
CM Jagan says he is praying for the safety of CDS Bipin Rawat

తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఊటీ సమీపంలోని డిఫెన్స్ కాలేజీకి వెళుతుండగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిపోయిందన్న సమాచారం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ కష్టకాలంలో వారికి మనోనిబ్బరం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News