Telangana: తెలంగాణలో కొత్తగా 105 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 23,888 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు
  • 17 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • ఇంకా 3,740 మందికి చికిత్స
Hundred more corona positive cases in Telangana

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 23,888 కరోనా పరీక్షలు నిర్వహించగా, 105 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకోగా, తాజాగా మరణాలేవీ లేవు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,861 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,740 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,973గా ఉంది.

More Telugu News