Hyderabad: హైదరాబాద్ మెట్రోలో మాస్క్ తీసి మాట్లాడుతున్నారా?.. బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు!

  • స్టార్ మాతో జత కట్టిన ఎల్‌అండ్‌టీ
  • ‘బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అంటూ ప్రచారం
  • కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహనే లక్ష్యం
Bigg Boss Watching you In Hyderabad metro rail

హైదరాబాద్ మెట్రో రైలులో మాస్క్ తీసి మాట్లాడేవారిపై ‘బిగ్‌బాస్’ ఓ కన్నేసి ఉంచిన విషయాన్ని మర్చిపోవద్దంటూ మెట్రో అధికారులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు స్టార్ మాతో కలిసి ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు.  ఈ మేరకు నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లోని బిగ్‌బాస్ సెట్‌లో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు.

బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జున, ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికుల భద్రతపై మరింత అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని నాగార్జున తెలిపారు. కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, మొబైల్ క్యూఆర్ కోడ్ టికెట్లు, స్మార్ట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంపొందించడమే ఈ ప్రచారం లక్ష్యమని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News