Nagashourya: 'లక్ష్య' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • నాగశౌర్య తండ్రి పాత్రలో జగపతిబాబు
  • ఎమోషనల్ గా సాగిన సాంగ్ 
  • నాగశౌర్య సరసన కేతిక శర్మ  
Lakshya lyrical video released

నాగశౌర్య కథానాయకుడిగా ఇటీవల థియేటర్లకు వచ్చిన 'వరుడు కావలెను' మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా గురించి ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే, తన తదుపరి సినిమాగా 'లక్ష్య'ను థియేటర్లకు తీసుకురావడానికి నాగశౌర్య సిద్ధమవుతున్నాడు. విలువిద్య నేపథ్యంలో సాగే కథ ఇది.  

నారాయణ్ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాలో, నాగశౌర్య జోడీగా కేతిక అందాల సందడి చేయనుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "అరచేతుల్లో దాచి .. వెలిగించే దీపం తానే, కనుపాపల్లే కాచి .. నడిపించే లోకం తానే" అంటూ ఈ పాట సాగుతోంది.

 తండ్రీకొడుకుల ప్రేమానురాగాలకి ప్రతీకగా నిలిచే ఈ పాటను నాగశౌర్య - జగపతిబాబుపై మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. కాలభైరవ స్వరపరిచిన ఈ పాటకి రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా, హైమత్ మహ్మద్ ఆలపించాడు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

More Telugu News