Corona Virus: కరోనా చికిత్సకు కొత్త మాత్ర... బ్రిటన్ ఆమోదం!

  • కరోనా రోగులకు అందుబాటులోకి 'మాల్నుపిరవిర్' 
  • 4.80 లక్షల కోర్సుల పిల్స్ కొనేందుకు గత నెలలోనే ఒప్పందం చేసుకున్న బ్రిటన్
  • ఈ పిల్స్ పై ఈ నెలలో నిర్ణయం తీసుకోనున్న అమెరికా
Britain becomes first country to approve Corona Oral Pill

కరోనా మహమ్మారికి ఇప్పటికే వివిధ రకాలుగా చికిత్స అందిస్తున్నారు. తాజాగా టాబ్లెట్ రూపంలోని మరో మందు కూడా అందుబాటులోకి వచ్చింది. 'మాల్నుపిరవిర్' పేరుతో తయారైన ఈ యాంటీ వైరల్ పిల్ ను మెర్క్, రిట్జ్ బ్యాక్ బయోథెరపిటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పిల్ వినియోగానికి బ్రిటన్ దేశం ఆమోదముద్ర వేసింది. ఈ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం బ్రిటనే కావడం గమనార్హం.

ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించిన లేదా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన ఐదు రోజుల్లోగా ఈ పిల్ ను వాడేందుకు ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. మరోవైపు 4.80 లక్షల కోర్సుల పిల్స్ ను కొనుగోలు చేసేందుకు గత నెలలోనే బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా ఒక కోటి కోర్సుల పిల్స్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని మెర్క్ తెలిపింది. ఈ పిల్ కు ఆమోదం తెలపడంపై అమెరికా ఈ నెలలో నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News