Pawan Kalyan: గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదు: పవన్ కల్యాణ్

  • గంజాయి వ్యవహారంపై పవన్ స్పందన
  • ఇది సామాజిక ఆర్థిక కోణంలో చూడాలని సూచన
  • గత 15-20 ఏళ్లుగా దందా నడుస్తోందని వెల్లడి
  • వైసీపీ పాలనలో మరింత ఊపందుకుందని ఆరోపణ
Pawan Kalyan opines on Ganja smuggling

ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా ఇది నడుస్తోందని వెల్లడించారు. 2018 నుంచి తాను ఈ అంశాన్ని ఎత్తిచూపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింతగా విస్తరించిందని పవన్ ఆరోపించారు.

More Telugu News