Andhra Pradesh: కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ!

  • పెద్ద దిక్కును కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాలు
  • బాధిత కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం
  • రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లింపులు
AP Govt to give Rs 50000 for diseased families due to Corona

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను కాటేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. కుటుంబాన్ని పోషించే వ్యక్తులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిహారం కోసం బాధిత కుటుంబాలు చేసుకునే దరఖాస్తు నమూనాను కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని సంబంధిత శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News